Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 29 January 2021

ఢిల్లీ పెద్దల కోరిక నెరవేరింది...

 

ఢిల్లీ పెద్దల కోరిక నెరవేరింది...



అవును ఇది నిజమే.. ఈరోజు గణతంత్ర దినం సాక్షిగా దేశరాజధానిలో జరిగిన పరిణామాలు ఢిల్లీ పెద్దలకు సంతోషం కలిగించేవే.. చాలామంది నమ్మకున్నా ఇది నిజమే.. రైతుల ఆందోళనలో అసాంఘిక శక్తులున్నాయని తాము చెబుతూ వచ్చింది నిజమే అని వాదించేందుకు ప్రభుత్వ పెద్దలకు ఒక మంచి అవకాశం చిక్కింది. ఆందోళన ఏ రూపంలో ఉండబోతోందో అందరికీ తెలుసు. ఇంటలిజెన్స్ నివేదికలు కూడా ఇదే చెప్పాయి. అటు పోలీసులు ఇటు బిజెపి పెద్దలు పదే పదే ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. మరి జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు. ఢిల్లీ సరిహద్దుల్లో నామమాత్రపు సెక్యూరిటీ పెట్టి ఎర్రకోటను ఎందుకు గాలికి వదిలేశారు. ప్రభుత్వం తలుచుకుంటే రైతులు ఢిల్లీలోకి ప్రవేశించేవారా.. ట్రాక్టర్లను యుద్ధట్యాంకులుగా మార్చుకుంటున్నారని ఫోటోలతో సహా వార్తలు వచ్చిన విషయం ప్రభుత్వానికి తెలియనిదా.. అర్బన్ నక్సల్స్, ఖలీస్తానీ ఉగ్రవాదులు, పాకిస్తానీ టెర్రరిస్తులు రైతుల్లో చేరిపోయారని ఏడ్చిన ప్రభుత్వం నివారణ చర్యలు ఎందుకు తీసుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వం కోరుకున్నది ఈ తరహా పరిణామలే. ప్రభుత్వ అనుకూల శక్తులే ఈ విధ్వంసకాండకు దిగాయని నేను చెప్పటం లేదు. అలాగని నక్సల్స్ ప్రత్యక్షంగా దిగారని అనడమూ మూర్కత్వమే. ప్రజాగ్రహం హద్దులు దాటితే దాని ముఖచిత్రం తీవ్రవాదమే అనేది చరిత్ర నేర్పిన పాఠం. జరగాల్సింది జరిగింది. ప్రపంచం ముందు దేశం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిణామం ఇది. అయితే ఇది మోదీ సర్కారకు బాగా కలిసివచ్చిన అంశం. అందుకే జరిగేది తెలిసినా మౌనంగా ఉండిపోయింది. రాజకీయ లబ్ధికే ప్రయత్నించింది గానీ నివారణ చర్యలు తీసుకోలేదు. ఫలితంగా రైతులు ఆత్మరక్షణలో పడితే కేంద్రం ఫైచేయి సాధించింది. ఒకవేళ రైతులను అడ్డుకుంటే ప్రతిపక్షాలు బలపడతాయని ప్రభుత్వం భయపడింది. ప్రభుత్వ రాజకీయ స్వార్ధం కారణంగానే దేశం పరువు గంగలో కలిసింది.. అసలు ఇంతదాకా ఎందుకు తెచ్చుకున్నారు. రైతులంటే మరీ ఇంత అలుసా.. రైతులైనా నక్సల్స్ అయినా ఖలీస్తానీలైనా అది ఎవరైనా ప్రజలే. ప్రజల కడుపు మండితే ఢిల్లీ అయినా గల్లీయే అని రుజువయ్యింది. ప్రభుత్వమే ఈ విపరిణామాలకు బాధ్యత వహించక తప్పదు.ఇక మోదీ మీడియాకు రైతులను టెర్రరిస్టులు అంటూ విరుచుకుపడేందుకు మంచి అవకాశం దొరికింది.

No comments:

Post a Comment