Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 27 April 2021

సిగ్గుందా మీకు

 

సిగ్గుందా మీకు

కొంచమన్నా సిగ్గు శరం ఉందా అని డైరెక్టుగా అడుగుతున్నా... ఇందాక fb లో ఓ మిత్రుడి పోస్టు చూసి స్పందించి రాస్తున్నా ఇది.. మన పక్కదేశాల్లో కరోనా తక్కువ ఉంది అని ఆయన అంటే పాకిస్తాన్ కు వెళ్ళిపో మరి అని ఒక లత్కోర్ గాడు కామెంట్ చేసాడు. పోనీ ఆ పోస్టు పెట్టిన పెద్దమనిషి ముస్లిమా అంటే కానే కాదు.. పోనీ హిందూ మత వ్యతిరేక పోస్తా అంటే కానే కాదు. అంకెలు చెప్పిన వాస్తవాలే ఆయన చెప్పాడు. చర్చించటమే తెలియని మూర్ఖ భక్తులు అడ్డంగా వాదిస్తే ఎలా.. నిజమేగా పాకిస్తాన్, బాంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో కరోనా కేసులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఒకే అవి చాలా చిన్న దేశాలు వాటితో మనకు పోలికా అని ప్రశ్నించే మేధావులు ఉన్నారు. సరే కరోనాకు పుట్టినిల్లు అని చెబుతున్న చైనాలో కేసులు ఎందుకు నామమాత్రంగా ఉన్నాయి. ఏం అక్కడ కూడా జనాభా తక్కువే అని అంటారా ఏంటి.. మరీ ఇంత మూఢ భక్తి అయితే ఎలా? ముందు మీ అయ్యను అడగండి కరోనా టైంలో ఎన్నికలకు ఎలా వెళ్ళావని.. ఎందుకు వేలాది మందితో ర్యాలీలు చేస్తున్నావని.. ఇలాంటి టైంలో కుంభమేళా అవసరం ఏంటి... అన్నీ తెలిసినా ప్రభుత్వం ఎందుకు ఆంక్షలు పెట్టలేదు, ఏం బెంగాల్ ఓట్లు పోతాయనా.. మొదటి దశ అప్పుడు హౌలాగాడు ట్రంప్ కోసం కరోనాకు గేట్లు తెరిచారు. గుప్పెడంత మంది జమాతీలపై తోసేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు కుంభీలు జాంబీలై తిరుగుతున్నా ఒక్కడూ మాట్లాడడుఎందుకు?మొదటి నుంచి కరోనాపై ఒక ప్లానంటూ లేదు. ఒకడు గోమూత్రం అంటాడు, మరొకడు బురదలో పందిలా దొర్లితే కరోనా రాదంటాడు, పెద్దాయనేమో చప్పట్లు కొడుతూ సామాన్యుడికి అర్ధం కానీ భాషలో సొల్లు చెబుతుంటాడు. మీరేమో దేశం కోసం ధర్మం కోసం అంటూ ఎదురుదాడికి సిద్ధమైపోతారు. ఏముంది కరోనాకు గేట్లు తెరిచారు కాదు కాదు సరిహద్దులు చెరిపేసి స్వాగతం పలికారు. ఇప్పుడు వ్యాక్సిన్ వ్యాపారం చేస్తున్నారు. టీ అయినా టీకా అయినా మీకు వ్యాపారమే కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టి గృహ నిర్బంధం చేస్తారు. దేశం కోసం ధర్మం కోసం భరించాలి ప్రశ్నిస్తే పప్పాకు కోపం వస్తుందిమరి... అయినా ఆయనకేంటి హాయిగానే ఉంటాడు మీలాంటి మూర్ఖులు ఉన్నంతకాలం......

No comments:

Post a Comment